ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో కలిసి చేనేత భవన్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు. అదేవిధంగా చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయాదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్వమించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.