ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారును అతివేగంగా వస్తున్న ఓ కంటైనర్ లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో  కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కంటైనర్ లారీ ఢీకొట్టడంతో కారు సగభాగం నుజ్జు నుజ్జు అయింది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు.

Leave A Reply

Your email address will not be published.