డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ బిల్లు కు లోక్‌సభ ఆమోదం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ బిల్లు – 2023’ కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సభ్యుల మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.విపక్ష ఎంపీల ఆందోళనల నడుమే కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంఆ బిల్లు సభ ఆమోదం పొందడం వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రభుత్వప్రైవేటు సంస్థలు దేశ పౌరుల డాటాను ఎలా వినియోగించుకోవాలిఎలా వినియోగించకూడదు..అనే వివరాలను ఈ బిల్లులో పొందుపర్చారు.అయితేలోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక రాజ్యసభ ఆమోదం కూడా పొందితే చట్ట రూపం దాలుస్తుంది. కాబట్టి ఆమోదం కోసం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ లేనందున.. విపక్ష ఎంపీల్లో కూడా కొందరు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే ఈ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.