గొర్రెల పంపిణి లబ్ధిదారులకు నగదు బదిలీ అమలు చేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ బీర్కూర్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీలో లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాలనీ కామారెడ్డి జిల్లా గొర్రెల, మేకల పెంపకం దార్ల సంఘం డైరెక్టర్ పరువుగొండ కోరారు,మనుగోడులో గొర్రెల పంపిణిలో భాగంగా గొర్రెల పంపిణీ బదులుగా నగదు బదిలీ అమలు చేయడం జరిగిందని, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ నగదు బదిలీ పథకం అమలు చేయాలని కోరుతూ శనివారం రోజు బీర్కూరు మండల తాసిల్దార్ రాజు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా గొర్రె మేకల పెంపకం దారుల సహకార సంఘం డైరెక్టర్ పరువు గొండ బాన్సువాడ డివిజన్ యూత్ అధ్యక్షులు జల్దవారు రమేష్ ,బీర్కూరు మండల అధ్యక్షులు పీరుగొండ, మండల యూత్ అధ్యక్షులు పీరయ్య, కార్యదర్శి గంగాధర్, సాయిలు కుల పెద్దలు శ్రీను, సాయి గొండ, హన్ముగొండ, బీరుగొండ, ప్రవీణ్, రవి, శేఖర్, కుల సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.