పేద బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు గద్దర్
- ఐపిసి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ లక్ష్మి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజా గాయకుడు పేద బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు నిరంతర ఉద్యమ స్ఫూర్తి గద్దర్ మరనం పట్ల ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ( ఐపిసి)నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ లక్ష్మి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తాడిత పీడిత వర్గాల అబ్యున్నతి కోసం పెత్తం దారి వర్గాల దోపిడీ అరాచకాలను ఎదిరించి తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిన మహోన్నతుడు గద్దర్ అని కొని యాడారు. మానవత్వంతో లక్ష్యసాధనలో బడుగు బలగం బడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడిన మహోన్నతుడు గద్దర్ అని కొనియాడారు.ఆయన మరణం పేద బడుగు బలహీన వర్గాల కు తీరని లోటని పేర్కొన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు.