మరువలేని విప్లవ ప్రజా గాయకుడు గద్దర్

-  వాసుదేవరావు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర  ప్రదాన కార్యదర్శి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నటికీ మరువలేని విప్లవ కళాకారుడు ప్రజా గాయకుడు విప్లవ కవి స్వర్గీయ  గద్దర్ అని వారి కుటుంబానికి బంధుమిత్రులకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఎంతోమంది యువతకు కళాకారులకు స్ఫూర్తినిచ్చి తన జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు. నిస్వార్ధంగా ప్రజాసేవకై అంకితమైన గద్దర్ పేరుమీద ప్రభుత్వము అవార్డు ప్రకటించి రాబోయే తరంలో ఖద్దర్ ఆశయ సాధనకై కృషి చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలకు సూచించారు త్వరలోనే ఐపీసీ పార్టీ తరపున సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.