అసెంబ్లీ ని సినిమా హాలు గా మార్చారు..

- సభలో కేటీఆర్, మల్లారెడ్డి జోకర్ లు - అవినీతి, చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేప్రయత్నం చేసారు..    -  టీ పీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీ ని సినిమా హాలు గా మార్చారని,సభలో కేటీఆర్, మల్లారెడ్డి జోకర్ లు గా వ్యవహరించారని  టీ పీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి ఎద్దేవా చేసారు.మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ 9 ఏళ్ళ తర్వాత కూడా అసెంబ్లీ ని ఎలా నడపాలో అధికార పార్టీ కి తెలియక పోవడం సిగ్గుచేటన్నారు. అవినీతి, చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసారన్నరు.రేవంత్ రెడ్డి ని తిట్టడానికే కేటీఆర్ అసెంబ్లీ లో మాట్లాడారన్నారు.ఓ ఆర్ ఆర్ టెండర్ల వివరాలు బయటపెట్టమంటె ఎందుకు బయపడుతున్నారని అయోధ్య రెడ్డి ప్రశ్నించారు.లక్ష జీవోలను దాచిపెట్టారు..కాంగ్రెస్ అబివృద్ది చేస్తే..బీఆర్ఎస్ ఆ ఫలాలు తీసుకుని.. మేమే చేసామని చెప్పుకుంటుంన్నారని విమర్శించారు.మహారాష్ట్ర లో చనిపోయిన రైతు ల గురించి మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ లో రైతు ల గురించి ఎందుకు మాట్లాడట్లేదన్నారు.రేవంత్ రెడ్డి ని కేటీఆర్ ఏం చేయలేడన్నారు.రేవంత్ అంతు చూడడం కేసీఆర్ నుంచే కాలేదు.. కేటీఆర్. ఏంచేస్తాడన్నారు. అప్పులు కట్టేందుకు అప్పులు తెస్తున్నారు.భయం తో అమిత్ షా ,మోడీ దగ్గర కేటీఆర్ మోకరిల్లుతున్నాడని దుయ్యబట్టారు.. భవిష్యత్ అవసరాలను తాకట్టు పెట్టి భూములు అమ్ముతున్నారని,కేసీఆర్, కేటీఆర్ పాలనకు రాజకీయ పిండం పెడతాం.కేసీఆర్ క్యాబినెట్ లో చంద్రబాబు మినహా మిగతా మంత్రులు అంతా టీడీపీ క్యాబినెట్ ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.