కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన గడుగు గంగాధర్
తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్:
కార్యకర్త కుటుంబానికి పరామర్శించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుక్కల్ నియోజకవర్గ నాయకులు గడుగు గంగాధార్ గారు. అన్నారం గ్రామానికి చెందిన కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ హుస్సేన్ ఇటీవల మరణించడంతో శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు హుస్సేన్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని ఒక మంచి కార్యకర్తను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.