ఎస్సై ఉద్యోగానికి సెలెక్ట్ అయినా శిరీషకు సన్మానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బుధవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన పవార్ శిరీష ఎస్సై ఉద్యోగానికి సెలెక్ట్ అయినందున ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్ శిరీషను శాలువా, పుష్పగుచ్ఛము తో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అయ్యల సంతోష్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి నిరంతరం శ్రమించి SI ఉద్యోగం సాధించడం ఎంతో గొప్ప విషయమని, మరెందరికో ఆదర్శం అని, భవిష్యత్ లో మరెన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, బక్రే అనిల్, శ్రీకాంత్, నాగరాజు, రాథోడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.