అమృతోత్సవాల ముగింపు సందర్బంగా మాజీ సైనికులకు ఘన సన్మానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 75 సంవత్సరాల స్వతంత్ర అమృతోత్సవాల ముగింపు సందర్బంగా “మేరా మాటి-మేరా దేశ్” [నా మట్టి నా దేశం] అభియాన్ లో భాగంగా మాజీ సైనికులను సన్మానించే కార్యక్రమం బుధవారం  భారతీయ జనతాపార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యాట్మెంటన్ కోర్ట్, వాయుశక్తినగర్, దమ్మాయిగూడ మున్సిపాలిటీ నందు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి మాట్లాడుతు మార్చి 12,2021న ప్రారంభమైన స్వాతంత్ర అమృత మహోత్సవాలు ఆగస్టు 2023లో ముగియ నున్న కారణంగా దేశం కోసం పోరాడిన వీరులకు, అమరులకు వందనం అనే కార్యక్రమాన్ని బీజేపి కేంద్ర మరియు రాష్ట్రపార్టీ ఆదేశాను సారం… మన దేశం మన మట్టి మనందరిని కలుపుతుంది  “నేను పుట్టిన నేల నన్ను కన్న దేశం “మాటికో నిషాన్ – విరోన్ కా వందన్ మన మట్టికి నమస్సులు – మన వీరులకు వందనం కాబట్టి మట్టికి నివాళులు అర్పిస్తూ, వీరులకు వందనం అర్పించే ఉదేశ్యంతో  ఈ రోజు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో మాజీ సైనికులందరినీ ఘనంగా సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపి ప్రధానకార్యదర్శి జిల్లాల తిరుమల్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అచ్చిమి నర్సింహా, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపి అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్, నాగారం మున్సిపాలిటీ బీజేపి అధ్యక్షులు బుద్దవరం వేణుగోపాల్, దమ్మాయిగూడ  మునిసిపాలిటీ అధ్యక్షులు మోర నాగమల్లారెడ్డి,వంగేటి బల్వంత్ రెడ్డి, దమ్మాయిగూడ యువ మోర్చా అధ్యక్షులు,జరిపేటి ఆంజనేయులు ఓబీసీ మోర్చా అధ్యక్షులు, మేడ్చల్ రురల్ జిల్లా మరియు దమ్మాయిగూడ మున్సిపాలిటీ బీజేపీ నాయకులు బలరాం సింగ్, శ్రవణ్ కుమార్, విక్రమ్ సింగ్, రఘునాథ్ సింగ్, హరి కుమార్ , మధుసూదన్, శోభా,తోట నరేష్, చక్రపాణి, కృష్ణ , రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల, మున్సిపాలిటీల, కార్పొరేషన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.