ఆర్మీ జవాన్ కు భాజపా నాయకుల సన్మానం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నాసురుల్లాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నా మట్టి – నా దేశం కార్యక్రమంలో భాగంగా గురువారం నసురుళ్లబాద్ మండల కేంద్రానికి చెందిన సెలవుల మీద గ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్ మంగలి కార్తీక్ ని భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, మాజీ అధ్యక్షులు చందూరి హన్మాండ్లు, కునింటి రాము, పెర్క రాములు, కంది మల్లేష్, అనుసూరి శ్రీనివాస్ రావు, రాములు, టెకుర్లా శేఖర్, బత్తిని రాజు, కమ్మరి సత్యనారాయణ డాక్టర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.