కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వంనిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని బీఆర్ఎస్ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  అన్నారు. గురువారం నాడు లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం నిధులు ఇచ్చిందని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘‘దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాం.కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వాలని కోరాం.ప్రధాన మంత్రికి , కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. వాట్సాప్, సోషల్ మీడియాలో అబబ్ధాలు ప్రచారం చేసినట్టు, పార్లమెంట్లో కూడా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రజల కోసం అడిగింది కూడా ఏమీ లేదు’’ అని లోక్ సభలో అవిశ్వాస తీర్మానంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కేంద్రంపై నిప్పులు చెరిగారు.

Leave A Reply

Your email address will not be published.