కెసిఆర్ మనసు మార్చాలని దుర్గామాతకు వినతిపత్రం అందజేసిన వీఆర్ఏలు

The VRAs submitted a petition to Goddess Durga to change KCR's mind

విఆర్ఏలు తమకు పే స్కేల్ ఇవ్వాలని చేస్తున్న నిరవధిక సమ్మె శనివారానికి 69 రోజుకు చేరింది. రోజువారి నిరసనలో భాగంగా నాసురుల్లాబాద్  మండల కేంద్రంలో  విఆర్ఏలు వినూత్న రీతిలో దుర్గమాత ప్రతిమకు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్బంగా  మండల జెఏసి అధ్యక్షులు పెంటయ్య మాట్లాడుతూ పే స్కేల్, ప్రమోషన్లు, 55 సంవత్సరాల నిండిన వారికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కేసీఆర్ మనసు మార్చి వెంటనే జీవో విడుదల చేసే విధంగా కరుణించాలని వేడుకున్నారు.  69 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని అన్నారు. ఇప్పటికే గత రెండు నెలలకు పైగా జీతాలు లేక పండుగలు(బతుకమ్మ, దసరా) సమయంలో కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోలేని పరిస్థితికి ప్రభుత్వం నెట్టి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.