జూబ్లీహిల్స్లో రూ. 2 లక్షల విలువైన ఈ-సిగరెట్లు సీజ్.. నలుగురు అరెస్ట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జూబ్లీహిల్స్లో నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తుల నుంచి రూ. 2 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో.. టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఆ నలుగురిని పట్టుకున్నారు. అరెస్టు అయిన వారిలో షేక్ అస్లాం, రహీల్ ఖాన్, రిషి అగర్వాల్, శ్రేయాష్ అగర్వాల్ ఉన్నారు. మరో అనుమానితుడు మహమ్మద్ షోయబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.షేక్ అస్లాం గత కొన్నాళ్ల నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. అతను నిషేధిత ఈ-సిగరెట్లు, హుక్కా ఫ్లేవర్స్ను విద్యార్థులకు, యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ-సిగరెట్లను సరఫరా చేసేందుకు, విక్రయించేందుకు అస్లాంకు మిగతా ముగ్గురు మద్దతు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి రూ.2 లక్షల విలువైన సిగరెట్లు, హుక్కా ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు.