ఐసెట్ కౌన్సెలింగ్‌ సెప్టెంబ‌ర్ 6 కు వాయిదా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు జ‌రిగాయి. ఈ నెల 14 నుంచి జ‌ర‌గాల్సిన ఐసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. సెప్టెంబ‌ర్ 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.8 నుంచి 12వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 8 నుంచి 13 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు న‌మోదు చేసుకోవ‌డానికి స‌మ‌యం ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలి విడుత సీట్ల‌ను కేటాయించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 22 నుంచి ఐసెట్ తుది విడుత కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.