టి అర్ ఎస్ పార్టీకి విరాళాల వెల్లువ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన టిఆర్ఎస్(బీఆర్‌ఎస్‌) పార్టీకి అండగా నిలిచేందుకు బాల్కొండకు చెందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న పలువురు లబ్దిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 93 వేల 600 రూపాయలు విరాళంగా అందజేశారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు అందాలంటే కేసిఆర్ గారి నాయకత్వం అవసరమని వారు పేర్కొన్నారు. భారత్ రాష్ట్ర సమితి తో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు తమ వంతు సహకారంగా 93,600 రూ. విరాళం ఇచ్చినట్లు లబ్దిదారులు తెలిపారు. విరాళం ఇచ్చిన వారిలో పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు, బీడీ కార్మికులు, రైతుబంధు, వృద్ధాప్య పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు. ఈ సందర్బంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసిఆర్ గారికి మద్దతుగా నిలబడిన లబ్ధిదారులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.