పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించడంతో వనపర్తి జిల్లా ఏదుల వీరాంజనేయ స్వామి రిజర్వాయర్ దగ్గర సంబురాలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతులు , నాయకులతో కలిసి శుక్రవారం సంబురాల్లో పాల్గొని రిజర్వాయర్‌ను పరిశీలించారు.రిజర్వాయర్ వద్ద ఉన్న టన్నెల్ ను పరిశీలించడంతో పాటు నీళ్లు ఎక్కడి నుంచి ఎలా వస్తాయోనన్న విషయాన్నిరైతులకు వివరించారు . ఈ సందర్భంగా రిజర్వాయర్ లో నిలిచిన నీటిలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి జలాభిషేకం చేశారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి పై రూపొందించిన డ్యాక్యుమెంటరీ ని చూసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలో ని 7 మండలాలకు చెందిన రైతులు , నాయకులు సంబురాల్లో ఆనందంగా పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.