సీఎం కేసీఆరే తోనే తెలంగాణ నష్టపోయింది

- రేవంత్‌రెడ్డి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆరే తోనే తెలంగాణ నష్టపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం నాడు బోయినపెల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కాంగ్రెస్ ప్రచార సభ నిర్వహిచింది. ఈ సభలో ‘తిరగబడదాం, తరిమికొడదాం’ ఛార్జ్‌షీట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి , తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేస్తే ఉరి తీయడం, పిండం పెట్టడం తెలంగాణ సంస్కృతి. తెలంగాణ పదమే ఇష్టం లేక పార్టీ పేరు మార్చుకున్న కేసీఆర్‌కు తెలంగాణకు ఏం సంబంధం.తెలంగాణ వాదానికి కేసీఆర్‌కు సంబంధం లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని కేసీఆర్ అంటే అందులో కేసీఆర్ ఉన్నారు.. తెలుగుదేశం మోసం చేసింది అంటే అందులోనూ కేసీఆర్ ఉన్నారు. టీఆర్ఎస్ మోసం చేసింది అంటే అందులోనూ కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్, మోదీ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. కిషన్‌రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో బండి సంజయ్‌ని అడిగితే బాగా చెప్తారు. ప్రజా కోర్టు తెలంగాణ కాంగ్రెస్ థీమ్. ప్రజాకోర్టులో మోదీ, కేసీఆర్‌ను నిలబెడతాం. కేటీఆర్‌కు వాదానికి, వ్యాధికి తేడా ఏం తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సోనియాగాంధీ విడుదల చేస్తారు.జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే సభలో ఖర్గే పాల్గొంటారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.