హైకోర్టు లాయర్ గా ఏపీ మంత్రి సతీమణి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ చదువుల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టు న్యాయవాదిగా మారారు. ఎంఏ ఫిలాసఫీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. అనంతరం ఫిలాసఫీ, లాలో రెండు పీహెచ్‌‌డీలు పూర్తి చేశారు. ఇప్పుడు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా.. సతీమణి ఝాన్సీని మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు.న్యాయం కోసం ఎదురు చూసే సామాన్యుని పక్షాన న్యాయ స్థానంలో నిలిచేందుకు ఈరోజు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషియన్ సభ్యత్వం పొందారు అంటూ అభినందనలు తెలిపారు. అలాగే ఝాన్సీకి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. తన ఎల్‌ఎల్‌బీ పూర్తైన వెంటనే న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్‌లో ఎన్రోల్ అయ్యే అవకాశమున్నా ఉన్నత విద్య కోసం ఆలస్యంగా లాలో పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు బార్ సభ్యత్వాన్ని అందుకున్నారు.ఝాన్సీ ఓ వైపు రాజకీయాల్లో ఉంటూనే చదువును కొనసాగించారు. బొత్స ఝాన్సీ ఇప్పటివరకు రెండుసార్లు విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్‌గా, మరోసారి ఎంపీగా పని చేశారు. ఝాన్సీ 2009 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీచేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కూడా గుర్తింపు పొందారు. ఇప్పటికీ రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే చదువును కొనసాగించారు. చదువుకు వయస్సు, రాజకీయాలు అడ్డుకాదని నిరూపించారు.

Leave A Reply

Your email address will not be published.