ప్రభుత్వ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్(టిఏఏ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిఏఏ అధ్యక్షులు ఏ రాజారావు పతాకావిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ సమాజంలో చట్టాల మీద అవగాహన కల్పించడానికి టిఏఏ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుందన్నారు.అనేక కార్యక్రమాలు  నిర్వహించడం జరిగిందని, మునుముందు సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. టిఏఏ ద్వారా  పేదలకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఏఏ అధ్యక్షులు రాజారావు ఉపాధ్యక్షులు జి శివకుమార్, ప్రధాన కార్యదర్శి సురేందర్, జాయింట్ సెక్రెటరీ నీరజ్ ఠాకూర్, ఎం శ్రీనివాస్, ఉమా రమేష్, శ్యామ్, ఎస్ శ్రీనివాస్, మహేందర్, లక్ష్మణ్, శ్రీ సాయి శ్రీశైలం నాగార్జున తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.