ఐకమత్యంతో దేశ సమగ్రతను చాటాలి

- ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు     -  మైనార్టీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ సమగ్రత కోసం  భారతీయులందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని ఐకమత్యంతో దేశ సమగ్రతను చాటాలని మైనార్టీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న పిలుపు నిచ్చారు.అప్పుడే నిజమైన స్వాతంత్రం అని అన్నారు.ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ (ఐపిసి) ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని లిబర్టీ ప్లాజా ఐపీసీ కార్యాలయం ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేబీ శ్రీధర్ మైనార్టీ విభాగం జాతీయ అధ్యక్షులు బిషప్ దాసన్న ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దాస్ అన్న మాట్లాడుతూ భారత ప్రజలు కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో స్నేహభావంతో మెలిగినప్పుడే నిజమైన స్వాతంత్రమని దానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అందుకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలిపారు త్వరలోనే భారతదేశం మొత్తం ప్రజాదర్శన యాత్రను చేపట్టి కులమత ప్రాంత విభేదాలను పోగొట్టే విధంగా ప్రజల్లో సమైక్య భావం పెంచే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు రాజకీయాల కతీతంగా అన్ని పార్టీల వాళ్లు ఇందుకు కృషి చేయాలని తెలిపారు కార్యక్రమంలో ఐపిసి మీడియా అడ్వైజర్ సీనియర్ జర్నలిస్టు సూర్యప్రకాష్ గారు  సంఘ సేవకులు విజయ దేవి గారు రామరాజ్యం పార్టీ అధ్యక్షులు ధనేష్ ఐపీసీ ఉపాధ్యక్షులు దశరథం తెలంగాణ స్టేట్ జనరల్ సెకండరీ వాసుదేవరావు, గ్రేట్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ నవీన్ సేవాదళ్ విభాగము నాయకులు గంగిరెడ్డి ప్రచార కార్యదర్శి బాలాజీ శ్రీకాంత్ లిబర్టీ ప్లాజా మేనేజర్ సలీం  మరియు స్టాప్ ఐపిసి మహిళా విభాగం నాయకులు పుష్పాంజలి, వాణి, మానస, హైదరాబాద్ స్టేట్ పార్టీ అధ్యక్షులు అంజయ్య, నేతాజీ, ఐపీసీ క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జ్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.