23 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 23 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే బస్సు యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని వెల్లడించారు. 24 అసెంబ్లీ, 4 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బస్సు యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైందని పేర్కొన్నారు. బస్సు యాత్ర జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి నుంచి ప్రారంభం కాబోతుందని వివరించారు. చంద్రబాబు బస్సు యాత్రపై రేపు డేట్ ఫిక్స్ చేస్తారని తెలిపారు. హైదరాబాద్ నగరం అభివృద్ధికి కారణం చంద్రబాబేనని గుర్తుచేశారు. గ్రేటర్‌లో జరిగే టీడీపీ బస్సు యాత్రను విజయవంతం చేస్తామని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.