బొగ్గుగనిలో భారీ పేలుడు.. 25 మంది మృతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టర్కీలోని ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందగా, 110 మందికిపైగా గాయపడ్డారు. మరో 50 మంది గని చిక్కుకుపోయారు. బొగ్గగనిలో శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వల్ల పేలుడు సంభవించింది. దీంతో 25 మంది దుర్మరణం చెందారని అధికారులు వెల్లడించారు. 11 మంది క్షేమంగా బయటపడ్డారని వారిని దవాఖానకు తరలించామని చెప్పారు. సుమారు 50 మంది కార్మికులు గనిలో 300 నుంచి 350 మీటర్ల దూరంలో చిక్కుకుపోయారని తెలిపారు.వారిని వీలైనంత తొందరగా రక్షిస్తామని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సులేమాన్ సోయ్లు తెలిపారు. ఇప్పటికే చాలా మందిని బయటకు తీసుకొచ్చామన్నారు. గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్ కోకా ట్వీట్ చేశారు. టర్కీలోని సోమాలో 2014లో జరిగిన బొగ్గుగని ప్రమాదంలో 301 మంది కార్మికులు మరణించారు.