ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ద్విచక్ర వాహనం అద్భుతప్పి ఓ వ్యక్తికి గాయాలైన ఘటన పిట్లం మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిట్లం మండల కేంద్రంలోని రాజస్థాన్ దాబా హోటల్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు కిందకి దూసుకువెల్లింది. ఈ ఘటనలో నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన వడ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి గాయలపాలయ్యాడు. స్థానికులు 161 జాతీయ రహదారి అంబులెన్స్ వారికి సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.