మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మవిశ్వాసం  

- విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు తప్పనిసరి చేయాలి             -  స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆత్మవిశ్వాసము

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శారీరక సంతులనం ఇచ్చే మార్షల్ ఆర్ట్స్ కు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని,స్వీయ రక్షణ క్రమశిక్షణకు తోడ్పడే కరాటే కుంగ్ ఫు లాంటి మార్షల్ ఆర్ట్స్ కు తెలంగాణ పల్లెల్లో సైతం విపరీతమైన ఆదరాభిమానాలు ఉన్నాయని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఈరోజు ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో    ఇండియా షాటోకన్ కరాటే&కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో సరూర్ నగర్  లో నిర్వహించబోయే జాతీయ కరాటే  కుంగ్ ఫు పోటీల పోస్టర్ ను  ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  మార్షల్ ఆర్ట్స్ కు తెలంగాణ గ్రామాల్లో విపరీతమైన ఆదరణ ఉందని ప్రతి గ్రామంలో కరాటే కోచింగ్ సెంటర్లు విరివిగా నెలకొని ఆదరింపబడుతున్నాయన్నారు. తనను తాను రక్షించుకోవడానికి అదే సమయంలో ఇతరులను రక్షించడానికి ఉపయోగపడే ఈ క్రీడలు ప్రతి విద్యార్థి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ముఖ్యంగా విద్యార్థినిలు,మహిళలు వర్కింగ్ ఉమెన్స్ కరాటే కుంగ్ ఫుల్లో తప్పనిసరి శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరం ఉందన్నారు. ప్రతి కళాశాలలో విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులలో ప్రాథమిక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలోఇండియా షాటోకన్ కరాటే&కుంగ్ ఫు అకాడమీ అధ్యక్షులు సి రాజు,టోర్నమెంట్ ఆర్గనైజర్స్ కృష్ణ గౌడ్,        వి .నరేందర్ ,ఎం . శ్రీరంగ, సిహెచ్ రవి,కే శేఖర్ రెడ్డి,ఎండి నవీద్,టీ .నగేష్ బి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.  సినీ నటులు సుమన్, విశ్వక్ సేన్ ముఖ్యమైన ప్రమోటర్లుగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.