ఎల్బీనగర్ ఎమ్మెల్యేకు మహిళా సంఘాల అభినందనలు
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఎల్ బి నగర్ నియోజకవర్గం శాసన సభ్యునిగా దేవిరెడ్డి సుదీర్ రెడ్డి తిరిగి నియమితులైన సందర్బంగా పలు మహిళా సంఘాలకు చెందిన మహిళా నేతలు సుదీర్ రెడ్డి నివాసానికి కి వెళ్లి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా బిసి ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఏ.పుష్పాలత మాట్లాడుతూ ఎల్ బి నగర్ నియోజకవర్గం లో తిరిగి సుదీర్ రెడ్డి గెలుపొంది బిఆర్ఎస్ జండాను ఎగురవేయగలరన్న ఆశాబావాన్ని వ్యక్తం చేసారు. సుదీర్ రెడ్డి విజయాయం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. అలాగే సుదీర్ రెడ్డి సతీమణి కమలా రెడ్డి ని కలిసి అభినందనలు తెలిపారు. సుదీర్ రెడ్డిని కలిసిన వారిలో రాజితా రెడ్డి ,సరోజా తదితలు పాల్గొన్నారు.