తుపాకీ మిస్ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: హైదరాబాద్‌ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందాడు.వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన భూపతి శ్రీకాంత్‌ ( 30 ) పాతబస్తీ హుస్సీనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి యథావిధిగా డ్యూటీ ముగించుకున్న శ్రీకాంత్‌ భూపతి నిద్రిస్తున్న క్రమంలో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. చెవిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని హుటాహుటిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ భూపతి బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.

Leave A Reply

Your email address will not be published.