తెలంగాణ‌లో మ‌రో రూ. 647 కోట్ల పెట్టుబ‌డుల‌కు కోకా కోలా నిర్ణ‌యం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. ప‌లు కొత్త కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తుండ‌గా, ఇప్ప‌టికే కార్య‌క‌లాపాలు ప్రారంభించిన ప‌లు కంపెనీలు.. త‌మ ప్లాంట్ల‌ను మ‌రింత విస్త‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.కోకా కోలా సంస్థ‌ రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌ను రెట్టింపు చేస్తుంది. సిద్దిపేట‌లోని ప్లాంట్‌ను మ‌రింత విస్త‌రించాల‌ని కోకా కోలా సంస్థ నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్లాంట్‌లో అద‌నంగా రూ. 647 కోట్ల పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించింది. వ‌రంగ‌ల్ లేదా క‌రీంన‌గ‌ర్‌లో రెండో త‌యారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబ‌డులు పెట్టింది కోకా కోలా సంస్థ‌.

Leave A Reply

Your email address will not be published.