కుమార్తె మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఖైరతాబాద్లో విషాదం చోటు చేసుకుంది. తన ఐదేళ్ల కుమార్తె మృతిని తట్టుకోలేని తండ్రి కిశోర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల అనారోగ్యంతో చిన్నారి మృతి చెందింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని తండ్రి.. ఆ బాధతో ఖైరతాబాద్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.