ఎన్టీఆర్‌ పేర రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము విడుదల చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నటుడు బాలకృష్ణ, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో పనిచేసిన సన్నిహతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌ ముర్ము మాట్లాడుతూ.. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీర్‌ ఎంతో ప్రత్యేకమన్నారు. కృష్ణుడు, రాముడి వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని, ప్రజల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్‌ తన ప్రత్యేకత చాటుకున్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని వెల్లడించారు. ఎన్టీఆర్‌ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు.హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో తయారైన ఈ స్మారక నాణెం.. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఉంటుంది. ఓ వైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటే మరోవైపు మూడు సింహాల బొమ్మ ఉంటుంది. ఎన్టీఆర్ శత జయంతి అని హిందీలో రాసి దాని కింద 1923-2023 అని రాసుంటుంది.

Leave A Reply

Your email address will not be published.