మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ నియామకం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లా ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తున్న శరత్ చంద్ర పవార్ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి బదిలీ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన చంద్రమోహన్ 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీస్ శాఖలో చేరారు.దేవరకొండ డీఎస్పీగా, కరీంనగర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పని చేశారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్గా పనిచేసి ఇటీవలే నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హైదరాబాదులోని డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, మంగళవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.