రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళ వారాల్లో అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో మాత్రం సోమ, మంగళ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలవల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టారు.