షర్మిల ఢిల్లీ పర్యటనలో కొనసాగుతున్న ఉత్కంఠ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. షర్మిల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారన్న వార్తల నేపథ్యంలో షర్మిల ఢిల్లీ పర్యటనలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల బెంగుళూరులో కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్‌తో షర్మిల సమావేశమైన విషయం తెలిసిందే. త్వరలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసే అవకాశం? ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కార్యకర్తలతో షర్మిల వేదిక ఏదైనా వైఎస్సార్ సంక్షేమ పాలనే తన లక్ష్యమని స్పష్టం చేసినట్టు సమాచారం. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమె సేవలను ఏపీలో వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.

Leave A Reply

Your email address will not be published.