వరంగల్ వేదికగా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్; మరోసారి తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపర్యటించనున్నారు.. ఈమేరకు తెలంగాణ బీజేపీకార్యచరణ రూపొదింస్తుంది.ఈ పర్యటనలో అమిత్‌ షా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. గతేడాది నుంచి సెప్టెంబర్ 17వ తేదీను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి వరంగల్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర భద్రత దళాలతో వరంగల్‌లో కవాతు నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ కవాతులో అమిత్ షా గౌర వందనం స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారనుంది.

 

 

Leave A Reply

Your email address will not be published.