అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ సీనియర్ నేత కోదండ రెడ్డి పలు సూచనలు చేశారు.

 

1. టికెట్ కేటాయింపు కోసం ఉదయపూర్ డిక్లరేషన్‌ను ఫ్రేమ్‌వర్క్‌గా ఉపయోగించాలి.

 

2. గత ఎన్నికల్లో మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఓడిపోయిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వకూడదు.

 

3. తెలంగాణాలో 2018 శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వారికి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్లు ఇవ్వకూడదు.

 

4. ప్రత్యేక పరిస్థితుల్లో తప్పా, ఇతర పార్టీల అభ్యర్థులకు పారాచూట్‌లో వచ్చిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వకూడదని రాహుల్ గాంధీ అనేక సమావేశాల్లో చెప్పారు

 

5. పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువత, యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

 

6. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్‌కు కనీసం 3 టిక్కెట్లు ఇవ్వాలి.

 

7. పార్టీలో ఇటీవల చేరిన పొంగులేటి శ్రీనివాస్ లాంటి ఒకరిద్దరి తప్పా కొత్తగా చేరిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకూడదు.

 

8. పీసీసీ ఎన్నికల కమిటీ ముందు పెట్టిన జాబితా లోపాలతో నిండి ఉంది. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తులను పూర్తిగా తిరస్కరించాలి.

 

9. PECలో కనీసం 50 శాతం మందైనా టిక్కెట్ ఆశించని వారు ఉండాలి. పీఈసీ సభ్యులు ఆశావాహులుగా ఉంటే వారికి వారు మద్దతు ఇచ్చుకుంటారు. తద్వారా ఎంపిక ప్రజాస్వామికంగా జరగదు.

 

పై సూచనలను సీరియస్‌గా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని కోదండరెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.