ఆదాని మోడీ మధ్య సంబంధం ఏమిటి

- నిలదీసిన రాహుల్ గాంధీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: అదానీ-మోదీ మధ్య సంబంధం ఏమిటి?: నిలదీసిన రాహుల్ గాంధీ

 

 

 

ముంబై ఆగష్టు 31 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం మరోసారి అదానీ గ్రూప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలపై విరుచుకుపడ్డారు. అదానీ-మోదీ మధ్య సంబంధం ఏమిటని నిలదీశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ నివేదికను ప్రస్తావిస్తూ, అదానీ గ్రూప్ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత సవివరమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ముంబై వచ్చిన గాంధీ మీడియాతో గురువారం మాట్లాడారు.ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాల నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన గురువారం మాట్లాడుతూ, ఓసీసీఆర్పీ నివేదికను ప్రస్తావిస్తూ, అదానీ గ్రూప్ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత సవివరమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ సమస్యను లేవనెత్తినపుడు మోదీ అసౌకర్యంగా, ఆందోళనగా కనిపిస్తారని ఆరోపించారు. ఈ విషయాలు ఆయనకు చాలా సన్నిహితమైనవన్నారు. అదానీ-మోదీ మధ్య సంబంధాలేమిటని నిలదీశారు. మోదీతో అదానీ గ్రూప్‌నకు సంబంధాలు ఉన్నాయని ఓ పత్రికా కథనాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యపై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. అదానీ గ్రూప్ తన షేర్లలో తానే రహస్యంగా పెట్టుబడులు పెట్టిందని ఓ పత్రిక రాసిన కథనాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఏం జరుగుతోందో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా వివరించడం చాలా ముఖ్యమన్నారు. అదానీ గ్రూప్‌ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇది ఎవరి సొమ్ము అని నిలదీశారు.

Leave A Reply

Your email address will not be published.