లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/వికారాబాద్ జిల్లా(నవాబ్ పెట్): చేవెళ్ల నియోజకవర్గం లోని నవాబ్ పేట్ మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 38 మంది లబ్ధిదారులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శనివారం పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
పేదింటి ఆడపడుచులకు కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,లబ్ధిదారులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు,పాల్గన్నారు.