ట్రాఫిక్ నుండి తప్పించేందుకు ఆటోను ఏకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఎక్కించేశాడు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఒక్కసారి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయామంటే అంతే సంగతులు. గంటల తరబడి అక్కడే చిక్కుకుపోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనదారులైతే వాహనాల మధ్యలో దూరి ఈజీగా వెళ్లిపోతుంటారు. అయితే, ఆటో, కారు, బస్సులు మాత్రం ముందు వాహనాలు కదిలే వరకూ వేచి ఉండాల్సిందే.అయితే, దేశ రాజధాని ఢిల్లీ లో ఓ ఆటో డ్రైవర్‌) మాత్రం ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు తన మూడు చక్రాల వాహనాన్ని ఏకంగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఎక్కించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను 25 ఏళ్ల మున్నాగా గుర్తించారు. ఈ మేరకు అతడిని అరెస్ట్‌ చేసి ఆటోన సీజ్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.