వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్తు

- వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్తు అనిరైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు మండలకేంద్రంలో శ్రీ సాయి రైస్ ఇండస్ట్రీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పది వేల ఎకరాలను కేటాయించింది.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధురైతుబీమారుణమాఫీఉచిత కరంటుసాగునీళ్లు అందించి వంద శాతం పంటల కొనుగోళ్లు చేసి రైతుకు అండగా నిలుస్తున్నదని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో రెండు సార్లు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. సాంప్రదాయ వ్యవసాయంసాంప్రదాయ పంటల నుంచి రైతులను బయటకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంటల మార్పిడి వైపు నడిపిస్తున్నదని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం మూలంగా ఆయిల్ పామ్ సాగులో దేశంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది. మరో ఏడాదిలో ప్రథమస్థానంలో నిలవనున్నది. ప్రభుత్వ చర్యల మూలంగా తెలంగాణ రైతు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. భవిష్యత్‌లో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నాడని చెప్పారున. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. అనంతరంపెబ్బేరు చెలిమిల్ల 5వ వార్డు నుంచి బీజేపీని వీడి బీఅర్ఎస్‌లో చేరిన 100 మంది నాయకులుకార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్పెబ్బేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌని బుచ్చరెడ్డిపెబ్బేరు మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్కౌన్సిలర్ గోపిబాబుతదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.