బీసీ జనగర్జన సభను విజయవంతం చేయండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బీసీ జన గర్జన సభను విజయవంతం చేయాలనీ బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్, పిలుపు నిచ్చారు. స్థానిక మహాత్మాజ్యోతి రావు పూలె విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్, ప్రముఖ వైద్యులు వూర రామ్మూర్తి యాదవ్ లు మాట్లాడుతూ బీసీ లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి దేశంలో రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ లను ఇప్పటి వరకు అన్ని పార్టీలు రాజ్యాధికారానికి దూరంగా ఉంచారని అన్నారు ఇప్పటికైనా బీసీ లు అందరు ఐక్యత తో రాజ్యాధికారం చేపట్టేవిధంగా చైతన్యం కావాలని అన్నారు అన్ని రాజకీయ పార్టీలు బీసీ లకు 60% రాజకీయ రిజర్వేషన్లు కేటాయించాలని అన్నారు బీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగే బీసీ జనగర్జన సభకు బీసీ లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అన్నారు ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు ముషం రవికుమార్, బెంజారపు రమేష్, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు గుండాల సందీప్, పేర్ల గిరి, మస్కాపురం ప్రవీణ్, సిద్ది రాము, సతీష్,జటంగి ఫణి యాదవ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.