జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కుండపోతగా వర్షం..
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్లో వరణుడి విజృంభణ కొనసాగుతున్నది. బుధవారం సైతం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా భారీవర్షం కురుస్తుంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖా సూచించారు. కాగా, రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. మియాపూర్లో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక బండ మైలారంలో 13.8 సెం.మీ., దుండిగల్ ఫారెస్ట్ అకాడమీలో 12.9 సెం.మీ., కూకట్పల్లి హైదర్నగర్లో 12.7 సెం.మీ., మాదాపూర్లో 10.7 సెం.మీ., శేరిలింగంపల్లి 11.45 సెం.మీ., షేక్పేటలో 11.9 సెం.మీ., బోరబండ 11.6 సెం.మీ., గాజుల రామారం 10.9 సెం.మీ., షాపూర్లో 10.6 సెం.మీ., బాచుపల్లి, రాయదుర్గంలో 10.1 సెం.మీ., ఖైరతాబాద్ 10.1 సెం.మీ., రాజేంద్రనగర్లో 10 సెం.మీ., గచ్చిబౌలిలో 9.6 సెం.మీ., బహదూర్పురా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.