భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. చిట్యాల మండలం కైలాపూర్లో మిరపనారు నాటుతుండగా పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను సరిత(30), మమత(32)గా గుర్తించారు. కాటారం మండలం దామెరకుంటలో పిడుగుపడి రైతు మృతి చెందాడు. పొలం పనుల్లో నిమగ్నమైన రైతు రాజేశ్వర్ రావు(46)పై పిడుగు పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
వనపర్తి జిల్లాలో ఇద్దరు మృతి
వనపర్తి మండలం పెద్దగూడెంలో విషాదం నెలకొంది. వేర్వేరు చోట్ల చెరువుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పెద్దగూడెం శివారులో ఉన్న కుంటలో పడి ఆరేండ్ల బాలుడు మృతి చెందాడు. కొత్త చెరువులో శంకర్ నాయక్ అనే వ్యక్తి మునిగి ప్రాణాలు కోల్పోయాడు. శంకర్ నాయక్ చేపలు పట్టేందుకు వెళ్లి నీట మునిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరి కుటుంబాల్లో విషాదం నెలకొంది.