ఏపిలో 11 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్. జవహార్ రెడ్డి (మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ ఐఎన్ఆర్ బదిలీ అయ్యారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకూ ఐజీ క్యాడర్లో ఉన్న అధికారిని మార్చి అడిషనల్ డీజీ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా ఉన్న త్రివిక్రమవర్మను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐ.జీగా నియామకం జరిగింది. అలాగే రైల్వే అడిషనల్ డీజీపీగా ఉన్న కుమార్ విశ్వజిత్ను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- కడప జిల్లా ఎస్పీగా సిద్దార్థ కౌశల్ నియామకం
- అనంతపురం ఎస్పీగా అంబురాజన్ నియామకం
- విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీగా కే.శ్రీనివాసరావు బదిలీ
- గ్రేహౌండ్స్ ఎస్పీగా వసంత విద్యాసాగర్ నాయుడు నియామకం
- అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు నియామకం
- అనంతపూర్ 14వ బెటాలియన్ కమాండెంట్గా ఆర్.గంగాధర్ రావు నియామకం
- ఏసీబీ ఎస్పీగా నయూం అస్మీ నియామకం
- తూర్పు గోదావరి ఎస్పీగా పి.జగదీష్ నియామకం