16వ తేదీన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్‌ ను ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16వ తేదీన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్‌ ను ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సిద్ధమైంది. 2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోత జరగనుంది. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లోని పల్లె పల్లె నుంచి ప్రజలుగ్రామ సర్పంచులు హాజరుకానున్నారు. ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్రంగారెడ్డి జిల్లాలలోని ప్రతీ గ్రామంలో ప్రజలుగ్రామ సర్పంచులు దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించు కుందామనిదక్షిణ తెలంగాణకు పండుగ రోజని అన్నారు. ఎన్నో మొక్కులు మొక్కితేదైవకృపతోఇంజనీర్ల కృషితోపాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందనికాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయాలనుకున్నామనిపట్టుదలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషిలో కీలక పాత్ర పోషించిన సీఎంవో అధికారులకుఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలుశుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరుసాగునీరు అందనుందనిబంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.