విపక్షాలు తమ కూటమికి ‘భారత్‌’ అని పేరు పెట్టుకోవాలి             

-  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశం పేరును ఇండియా’ నుంచి భారత్‌’ గా మారుస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ అంశం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాగావిపక్ష కూటమి ఇండియా’ అని పేరు పేట్టుకోవడం వల్లనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పేరును భారత్‌గా మార్చాలనుకుంటోందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ స్పందించారు. ఈ మేరకు విపక్ష కూటమికి కీలక సూచన చేశారు.విపక్షాలు తమ కూటమికి భారత్‌’ అని పేరు పెట్టుకోవాలి. అప్పుడే అధికార పక్షం పేర్లు మార్చే వికృత క్రీడను ఆపేసే అవకాశం ఉంది. అందుకే ప్రతిపక్షాల కూటమి ఇండియాకు బదులు భారత్‌’ అని అర్థం వచ్చే పేరు పెట్టుకోవాలి. భారత్‌ అంటే.. అలయన్స్‌ ఫర్‌ బెటర్‌మెంట్‌హర్మనీ అండ్‌ రెస్పాన్సిబుల్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ టుమారో’’ అని ఆయన వివరించారు.

Leave A Reply

Your email address will not be published.