మరో 100 వ‌ర‌కు ఆరోగ్య మహిళ కేంద్రాల విస్తరణ

- 12 న ప్రారంభించేందుకు ఏర్పాటు  - ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలను మరో 100 వ‌ర‌కు విస్తరించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ కొత్త ఆరోగ్య కేంద్రాల‌ను ఈనెల 12 న ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 272 ఆరోగ్య మ‌హిళా కేంద్రాలు ఉండగా, కొత్తవాటితో ఆ సంఖ్య‌ 372కు పెరగనుంది. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది ఉంటూ, 8 రకాల ప్రధాన వైద్య సేవల‌ను ఆరోగ్య మ‌హిళా క్లినిక్స్ అందిస్తున్నాయి. ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఆరోగ్య మ‌హిళా కేంద్రాల‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

8 ర‌కాల సేవ‌లు ఇవే..

  • మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
  • ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..
  • థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
  • మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
  • మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు.
  • నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
  • సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
  • బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.
Leave A Reply

Your email address will not be published.