దేశం పేరు మార్పు, సనాతన ధర్మం అంశంపై మంత్రులకు ప్రధాని కీలక సూచనలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సనాతన ధర్మం’ పై ఓ వైపు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతుంటే.. ఇలాంటి సమయంలో ఇండియా’ పేరు మార్పు అంశం  తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రెండు అంశాలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా దేశం పేరు మార్పు అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు.తాజాగా ఈ రెండు అంశాలపై ప్రధాని మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇండియా’ పేరు మార్పుసనాతన ధర్మం అంశాలపై ఆచితూచి మాట్లాడాలని కేంద్ర మంత్రులకు ప్రధాని సూచించినట్లు సమాచారం. భారత్‌’ అంశంపై అతిగా స్పందించొద్దని కేంద్ర మంత్రులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితేఉదయనిధి వ్యాఖ్యలను మాత్రం సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన సూచించినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.