అందరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవడమే లక్ష్యం
నేడు దేశానికి చారిత్రక రోజు: మోదీ
దేశానికి నేడు చరిత్రాత్మకమైన రోజు అని, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టెక్నాలజీలో దేశం ఇవాళ కొత్త శకంలోకి ప్రవేశించిందన్నారు. దేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించినట్లే చివరి వ్యక్తి వరకు 5G సేవలు అందిస్తామన్నారు. 5G సేవలు ఎన్నో అవకాశాలు కల్పిస్తాయని, విద్య, డిజిటల్ పేమెంట్లో నాణ్యతను పెంచుతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.