జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మూడేండ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సులో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ జె వెంకటి వెల్లడించారు. కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.దరఖాస్తు పూర్తి చేసిన అనంతరం.. దాన్ని డౌన్లోడ్ చేసి, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ భవనంలోని నాలుగో అంతస్తులో సెప్టెంబర్ 19వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ కింద రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. తదితర వివరాల కోసం dme.telangana.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.