ఆల్ ఇండియా రైట్ ఫోరం తెలంగాణా అధ్యక్షురాలిగా షేక్ ఖాతూన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆల్ ఇండియా రైట్ ఫోరం తెలంగాణా అధ్యక్షురాలిగా మలక్పేట్ కు చెందిన షేక్ ఖాతూన్ నియమితులైనారు. ఈ మేరకు ఆల్ ఇండియా ముస్లిం ఫెడరేషన్ దస్తగిరి నియామక పత్రాన్ని అందజేశారు.ప్రస్త్రుతం షేక్ ఖాతూన్ ఆల్ ఇండియా రోషిణి ఫౌండేషన్ సబ్యులుగా కొనసాగుతున్నారు.ఆమే సేవలు గుర్తించిన ఆల్ ఇండియా ముస్లిం ఫెడరేషన్ షేక్ ఖాతూన్ ను తెలంగాణా అధ్యక్షురాలిగా నియమించింది.ఈ సందర్బంగా షేక్ ఖాతూన్ మాట్లాడుతూ తనపై గల నమ్మకం తో తనకు ఈ పదవి అప్పగించిన ఆల్ ఇండియా ముస్లిం ఫెడరేషన్ దస్తగిరి కి అందుకు సహకరించిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు.